జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు.ఈ క్రమంలో మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని పవన్ కళ్యాణ్.బీమ్లా నాయక్ కాదు.
టీడీపీ పార్టీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ… సెటైర్లు వేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వద్ద పెద్దఎత్తున 35 సీట్లు లేదా 40 సీట్లలో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాడు అని ఎద్దేవా చేశారు.
మరి ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అని మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.పవన్ కళ్యాణ్ కి బిచ్చ నాయక్ అనే పేరు కరెక్ట్ గా సూట్ అవుతుంది అని సెటైర్లు వేశారు.
పవన్ అభిమానులు తనపై ఎన్ని ట్రోల్స్ చేసిన బెదిరే వ్యక్తిని కాదు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ప్రమాణ స్వీకారానికి.తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదని తెలిపారు.మంత్రి పదవి ఉన్నా ఉండకపోయినా జగన్ అన్నకి సైనికుడిగా పనిచేయటమే ఇష్టమని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.







