రోగాలు వస్తే నయం చేస్తాడని డాక్టర్ దగ్గరికి వెళతాం .ఆ సమయం లో వైద్యుడే ఆ రోగి కి దేవుడు.
అలాంటి డాక్టర్ లే ఈ మధ్య ఆసుపత్రి కి వచ్చిన వారితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.అలా తెలిసిన పంటి డాక్టర్ దగ్గరికి చికిత్స కోసం వచ్చిన అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడు ఒక డాక్టర్.
అసలు విషయానికి వస్తే.పాకిస్తాన్ లోని రావల్పిండి లో నివసిస్తున్న ఒక 22 సంవత్సరాల యువతి తన పంటి చికిత్స కోసం వారి ఇంటికి దగ్గర ఉండే వైద్యుడి దగ్గరికి ట్రీట్మెంట్ కోసం తరచుగా వెళ్ళేది.
ఒకరోజు యువతి కి ఆ డెంటిస్ట్ ఫోన్ చేసి ఈ రోజు నీ దవడకి చికిత్స చేస్తా అని తన ఆసుపత్రికి రమ్మన్నాడు.
ఆ సమయం లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేకపోవడం తో ఆమె ఒక్కతే డెంటిస్ట్ ఆసుపత్రికి వెళ్ళింది.
అక్కడికి వెళ్లిన ఆమెని ఆ డెంటిస్ట్ వైద్యం చేస్తానని చెప్పి డెంటల్ సర్జికల్ సీటు మీద కూర్చోమన్నాడు.దవడ భాగానికి అనస్తీషియా ఇంజక్షన్ ఇవ్వాలని అలా చేస్తే నొప్పి తెలియకుండా చికిత్స చేయవచ్చని నమ్మబలికాడు.
యువతి ఒంటరిగా ఆసుపత్రికి రావడంతో తన ప్లాన్ అమలు చేయాలనుకున్నాడు.డోసుకు మించి అనస్తీషియాను యువతికి ఇచ్చాడు.దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.అలా సృహ లో లేని ఆమె ని చూసి తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మన్నాడు.
మత్తులో ఉన్న ఆ యువతి పైన డెంటిస్ట్ తో సహా అతని స్నేహితులు కూడా అత్యాచారం చేశారు.తమ పని పూర్తయ్యాక ఆమె సృహ లోకి వస్తే వారికి ప్రమాదం ఉందని గ్రహించి డెంటిస్ట్ మరియు అతని స్నేహితులు ఆమెని ఎలాగైనా చంపేయాలి అని భావించారు.
ఆ డెంటిస్ట్ విషం ఇంజక్షన్ ఇవ్వడంతో యువతి కళ్లు తెరవకుండానే మరణించింది.అయితే ఆమె కుటుంబసభ్యులకు ఈ విషయం తెలిపారు.చికిత్స చేస్తున్నప్పుడు యాంటిబయాటిక్ ఇంజక్షన్ ఇస్తే రియాక్షన్ రావడంతో మరణించినట్లు ఆ అమ్మాయికి విష ఇంజక్షన్ ఇచ్చిన డెంటిస్ట్ తెలిపాడు.అయితే యువతికి పోస్టు మార్టం నిర్వహించగా అసలు సంగతి బయటపడింది.
ఆ యువతిని అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా విషమిచ్చి చంపారని తేలింది.దీనితో డెంటిస్ట్ ని అతని స్నేహితులను పోలీస్ లు విచారించాలని అనుకున్నారు.
కానీ వారిలో ఇద్దరిని మాత్రమే పోలీసు లు పట్టుకున్నారు.మిగితా ఇద్దరు పరారీలో ఉన్నారు.