సాధారణంగా కొందరి దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి.మద్యపానం, ధూమపానం, ఆహారపు అలవాట్లు, నోటి శుభ్రత లేకపోవడం తదితర కారణాల వల్ల ముత్యాల్లా మెరవాల్సిన దంతాలు పసుపు రంగులోకి మారి చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.
పసుపు దంతాలు కలిగిన వారు ఇతరులతో మాట్లాడడానికి తీవ్రంగా సంకోచిస్తుంటారు.హాయిగా నవ్వడానికి అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ చిట్కాను పాటిస్తే కనుక సహజంగానే పసుపు దంతాలను తెల్లగా తల తల మెరిపించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అరటి పండు తొక్కను తీసుకొని దాని లోపల వైపు ఉండే తెల్లటి పదార్థాన్ని స్పూన్ సహాయంతో సపరేట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ టూత్ పేస్ట్ వేసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా తోముకోవాలి.

అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను రోజుకు ఒకసారి కనుక పాటిస్తే పసుపు రంగులోకి మారిన దంతాలు మళ్ళీ తెల్లగా మిలమిలా మెరుస్తాయి.పైగా ఈ చిట్కాను పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.కాబట్టి పసుపు దంతాలతో తీవ్రంగా సతమతం అవుతున్నవారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన చిట్కాను పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.