ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) ఆరోపించారు.ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై దాడిని ఖండించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను ప్రశ్నించినందుకే తమ పార్టీ నేత మోహన్ రావు( Mohan Rao )పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు.చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద కూడా విధ్వంసం చేశారని ఆరోపణలు చేశారు.
ఈ దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే( MLA Balineni Srinivas Reddy ) కారణమని పేర్కొన్నారు.ఈ క్రమంలో దాడులకు పాల్పడ్డ రౌడీ మూకలపై ఎస్పీ సుమిత్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులపై ఈడీ దృష్టి పెట్టాలని తెలిపారు.







