ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలలో ప్రత్యేక హోదా ఇప్పటివరకు అమలు కాలేదు అన్న సంగతి తెలిసిందే.పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీని.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదు.ఈ ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాగా చేసుకుని ఏపీలో ప్రధాన పార్టీలు భారీ ఎత్తున రాజకీయాలు చేశాయి.
ఈ క్రమంలో అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయాయి.
పరిస్థితి ఇలా ఉంటే ఏపీ ప్రత్యేక హోదా హామీ విషయంలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదాపై ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని అన్నారు.
రైల్వే జోన్, నదుల అనుసంధానం, ఎయిమ్స్ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.బడ్జెట్ లో వీటిని చేరుస్తూ మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు.