రైతు భరోసా యాత్ర పేరుతో తిరుగుతున్న పవన్కళ్యాణ్ నిన్న చింతలపూడిలో సుదీర్ఘ ప్రసంగం చేసి, జగన్గారిపై విమర్శలు గుప్పించారు.టీడీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్యాయం జరిగినా ఏనాడూ వారి తరపున మాట్లాడలేదు.
రైతుల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి, ఎగ్గొట్టినా పవన్కళ్యాణ్ నోరెత్తలేదు.కానీ రైతుల పక్షపాతి అయిన జగన్ గారు, వారి కోసం ఎన్నో చేస్తున్నా పవన్కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు.
కౌలు రైతులకు కూడా మా ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తోంది.పెట్టుబడి సాయం రూ.13,500 చొప్పున కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఇస్తున్నాం.అలాగే ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్నాం.
కానీ ఇవన్నీ పవన్కళ్యాణ్కు కనిపించవు.ఎందుకంటే ఆయన చంద్రబాబు చేతిలో పావు.
ఆయన పవన్కళ్యాణ్ కాదు.చంద్రబాబు చేతిలో పావు కళ్యాణ్.
చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పక్షం జనసేన.
చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రతిపక్షం ఓట్లు చీలుస్తాడు.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే విపక్షమంతా కలిసి వెళ్దామంటాడు.ఇదీ పవన్కళ్యాణ్ నైజం.
బాబు కోసమే పవన్ ఆరాటం.రాష్ట్రంలో కాపు, ఒంటరి, బలిజ, మున్నూరుకాపు, తెలుగుకాపు అయిన బలమైన సామాజిక వర్గం ఎప్పుడూ తెలుగుదేశంకు వ్యతిరేకంగా లేరు.
కానీ వంగవీటిరంగా హత్య, ఆ తర్వాత, ఇటీవల ముద్రగడ పద్మనాభం అరెస్టు వ్యవహారాల తర్వాత వారు వ్యతిరేకమయ్యారు.వారిని తిరిగి తమవైపు మళ్లించడం కోసం చంద్రబాబు వేసిన గాలానికి ఎర పవన్కళ్యాణ్.
ఎందుకంటే చంద్రబాబు సీఎం కావాలని ఆయన కోరుకుంటున్నాడు.పవన్కళ్యాణ్ పార్టీ ప్రస్థానం ఒకసారి చూస్తే, 2014లో టీడీపీతో కలిసి పోటీ చేశారు.2019లో చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీలిపోవాలని చెప్పి విడివిడిగా పోటీ చేశారు.

ఇక ఇప్పుడు ఏం చేయబోతున్నాననేది మొన్ననే చెప్పాడు.ఏం చెప్పాడు.జగన్మోహన్రెడ్డి గారి వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాను తప్ప, ఈ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావాలనో, తన పార్టీ అధికారంలోకి రావాలనో, ఈ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం తనకు లేదు.
అని చెప్పాడు.దీన్ని బట్టి అర్ధం అవుతున్నది ఏమిటి.ఎర కాదా ఈయన.ఇంకా ఏమంటాడు.తాను వ్యక్తిగతంగా దూషించనని, కానీ వైసీపీ వాళ్లు ఆ పని చేస్తున్నారని అన్నాడు.అలాగే సెటైర్లు వేయనన్నాడు.కానీ అప్పటి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ను అల్లం వెల్లుల్లి అని, అవంతి శ్రీనివాస్ను బంతి, చామంతి, గోడకు కొట్టిన బంతి అని, నన్ను కూడా రాంబో రాంబాబు అన్నారు.అవన్నీ గుర్తు లేవా? అంటే అవన్నీ విమర్శలా? సెటైర్లు కావా? మీరైతే సెటైర్లు వేయొచ్చు.ఆ హక్కు దత్తపుత్రుడైన పవన్కళ్యాణ్కు ఉంటుంది.ఇండిపెండెంట్గా వ్యవహరించే మాకు మాత్రం ఉండవా.మీరు మరో మాట కూడా అన్నారు.స్క్రీన్ప్లే రాయొచ్చు అన్నారు.
రాయండి మాకు అభ్యంతరం లేదు.

దత్తపుత్రుడు అంటే సహించడట.మరి కాకపోతే ఎందుకు చాకిరీ చేస్తున్నావు.కాపులందరినీ కట్ట కట్టుకుని చంద్రబాబుగారి కాళ్ల దగ్గర పెట్టే ప్రయత్నం తప్ప, నువ్వు అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉందా? పోటీ చేయాలని ఉందా? అప్పుడే పొత్తుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక్క మాట చెప్పండి.మీకు ఆవగింజ అంత ధైర్యమున్నా, ఈ రాష్ట్రంలో పోటీ చేసే ధైర్యమున్నా, ఎవరితోనూ పొత్తు పెట్టుకోను.సింగిల్గానే వెళ్తాను ప్రజలు ఆశీర్వదించండి.అనే ధైర్యం ఉందా.ఆ దమ్ము లేదు.

కన్విక్షన్కు తేడా తెలియదు.ఎవరినైనా అరెస్టు చేస్తారు.విచారణ తర్వాత నేరం రుజువైతే కన్విక్ట్ అవుతారు.కానీ రెండింటికీ తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు.ఒక్క పవన్కళ్యాణే కాదు.ఆయనతో పాటు, ప్రతి విషయంలోనూ చంద్రబాబుగారు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5 రోజూ కుట్రలు పన్ని వండి వారుస్తుంటారు.వార్తలు రాస్తుంటారు.నేను ఒకటి మనవి చేస్తున్నాను.480 మంది రైతులు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటే, వారికి కూడా పరిహారం ఇచ్చిన ప్రభుత్వం జగన్గారిది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దీని గురించి ఎప్పుడైనా అడిగారా.
వార్త రాశారా.కానీ మా ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో పని చేస్తోంది.
దీనిపై ఇప్పటికే కమిటీ పని చేస్తోంది.సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
అయినా ప్రజలను, ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.







