పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన ఏపీ అధికార పార్టీ వైసిపి పార్టీ శ్రేణులను ప్రజలకు మరింత దగ్గర చేసే విధంగా అనేక కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.
ఇటీవల విజయవాడలో వైసీపీ ప్రజా ప్రతినిధుల సదస్సును భారీగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అనేక విషయాలపై జగన్ క్లారిటీ ఇచ్చారు.ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, ప్రజల్లోనే ఉండేందుకు జగన్( CM jagan ) కూడా నిర్ణయించుకున్నారు.
ఎన్నికలకు కీలకమైన ఈ ఆరు నెలలు పూర్తిగా ప్రజలకు దగ్గర అయ్యేందుకు జగన్ నిర్ణయించుకున్నారు .టిడిపి చంద్రబాబు వారెస్టు వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ , పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది .వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )వ్యవహారం పైనే జనాలు సెంటిమెంటు ను రగిల్చే పనిలో నిమగ్నమయ్యారు.
దీంతో జనాల్లో సెంటిమెంట్ లేకుండా చేసే విధంగా గత టిడిపి ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి , ఆ పార్టీపై పై చేయి సాధించే వ్యూహం తో జగన్ ఉన్నారు. దీనిలో భాగంగానే వైసీపీ సామాజిక బస్సు యాత్ర చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది.
అక్టోబర్ 26 నుంచి వచ్చే నెల 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర ( Bus yathra )జరగనుంది. ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర మొదలు కానుండగా, అనకాపల్లిలో ముగియనుంది .తొలి విడత 13 రోజుల పాటు ఈ యాత్ర జరగనుండగా , ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
అలాగే ఈ నెల 26 ఇచ్చాపురంలో , 27న గజపతినగరం , 28న భీమిలి , 30న పాడేరు 31న , ఆముదాలవలస నవంబర్ 1న పార్వతీపురం , నవంబర్ 2న మాడుగుల, నవంబర్ మూడన నరసన్నపేట, నవంబర్ 4న శృంగవరపుకోట , నవంబర్ 5న గాజువాక , నవంబర్ 7న రాజాం నవంబర్ 8న సాలూరు , నవంబర్ 9న అనకాపల్లిలో బస్సు యాత్ర జరగనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy