సినిమా రంగంలో సక్సెస్ సాధించడం కంటే ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.బాహుబలి2 సినిమాతో ప్రభాస్ కోరుకున్న ఇండస్ట్రీ హిట్ సాధించారు.ఫుల్ రన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.అయితే బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తాయని అందరూ భావిస్తే అందుకు భిన్నమైన ఫలితాలు అందుకున్నాయి.
కేజీఎఫ్2 తర్వాత యశ్ క్రేజ్ అమాంతం పెరిగింది.యశ్ శంకర్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వార్తలు వైరల్ అవుతున్నా ఆ వార్తలు గాలి వార్తలే అని తేలిపోయింది.
యశ్ ను హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉన్న స్టార్ డైరెక్టర్లు శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో తక్కువగా ఉన్నారు.అయితే యశ్ తర్వాత ప్రాజెక్ట్ కు కన్నడ డైరెక్టర్ డైరెక్షన్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రభాస్ చేసిన తప్పే యశ్ చేస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.యశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ సక్సెస్ లను అందుకోవాల్సి ఉంది.మరి ఆ రేంజ్ కథలను యశ్ ఎంచుకుంటారో లేదో చూడాల్సి ఉంది.కేజీఎఫ్2 సినిమా తర్వాత యశ్ రెమ్యునరేషన్ సైతం అమాంతం పెరిగింది.యశ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.యశ్ తో సినిమాలను నిర్మించడానికి స్టార్ ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే యశ్ తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే మాత్రమే మార్కెట్ కొనసాగే అవకాశం ఉంటుంది.యశ్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.యశ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి.