మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.
యండమూరి వీరేంద్రనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి రెమ్యునరేషన్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నేను ఒక సమయంలో ఒకే డైరెక్టర్ తో పని చేశానని యండమూరి అన్నారు.
అప్పట్లో రెమ్యునరేషన్లు మాత్రమే ఇచ్చేవారని సినిమాకు వాటాలు తీసుకునే అవకాశం లేదని ఆయన అన్నారు.తనకు అభిలాష సినిమాకు 25,000 రూపాయలు ఇస్తే స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాకు 2.5 లక్షల రూపాయలు ఇచ్చారని అప్పట్లో రెమ్యునరేషన్లు అంతే ఇచ్చేవారని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు.మనకు వీలైనంత డబ్బు ఉండాలని నా వాళ్లు బాగుండాలి నేను బాగుండాలి అనే తాపత్రయం ఉండకూడదని యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు.
నేను వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించడం వల్ల కోపం పూర్తిగా తగ్గిపోయిందని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు.సింగపూర్ లో తాను కొడుకు, కోడలు నుంచి తప్పిపోయానని తన దగ్గర పాస్ పోర్ట్ లేదని ఫోన్ పని చేయడం లేదని ఆ తర్వాత ఒక తెలుగు వ్యక్తిని సహాయం అడిగానని యండమూరి వెల్లడించారు.ఆ వ్యక్తికి తాను ఎవరో తెలియదని యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు.
కోపం తగ్గడం, నవ్వుతూ ఉండటం దీనిని క్రైసిస్ మేనేజ్ మెంట్ అంటామని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు.చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకున్నారని అపార్థాలు, నిందలు అనేవి కామన్ అని ఆయన అన్నారు.మహాత్మ గాంధీ, మదర్ థెరిసాను కూడా అపార్థం చేసుకున్నారని యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు.
యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.