సాధారణంగా మనం వంటింట్లో వాడే పదార్థాలు లలో చాలా పదార్థాలు మనకు ఆయుర్వేదం గా పనిచేస్తాయి.అయితే మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి నరాల్లో అడ్డంకులు, వెరికోస్ వీన్స్, నరాల బలహీనుత, గుండెల్లో నొప్పి లాంటి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు.
ఈ మధ్యకాలంలో చాలా మందికి నరాల్లో అడ్డంకులు ఏర్పడడం, అర్టరీస్ లో అడ్డంకులు ఏర్పడడం లాంటివి జరుగుతుంది.
అలాగే మరీ ముఖ్యంగా శరీరంలో రక్తం చిక్కగా మందంగా మారుతుంది.
రక్తం మందంగా( Blood ) ఉండడం వల్ల రక్తం సరిగా ప్రవహించదు.దీనివల్ల అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి.
అదే విధంగా ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.జంక్ ఫుడ్( Junk food ) ఎక్కువగా తీసుకోవడం, అలాగే నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, కూర్చున్న చోటే గంటలు గంటలు కూర్చొని పనిచేయడం.
అయితే ఇవన్నీ చేయడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ( Cholesterol )పేరుకుపోయి రక్త సరఫరాకు అడ్డంకిగా మారుతుంది.
ఇలా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.రక్తనాళాల్లో అడ్డంకులు లేకుండా చూసుకోవడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
అయితే ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో ఇలాంటి సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.పసుపు అలాగే వెల్లుల్లితో మనకు ఎన్నో రకాల ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయి.
అయితే రక్తాన్ని పలుచగా చేయడంలో వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది.
వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.దీని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
పసుపు వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.రోగ నిరోధిక శక్తి( Immunity ) కూడా పెరుగుతుంది.
దీనివల్ల గుండె ఆరోగ్యం అలాగే ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ నీ తొలగించడంలో సహాయపడుతుంది.