ఏడాది పొడవునా లభించే పండ్లలో జామ ఒకటి.తక్కువ ధరకే లభించినా జామ పండ్ల రుచి అద్భుతంగా ఉంటుంది.
అందుకే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ జామ పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు.పైగా జామ పండ్లలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా జామ పండ్లు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే జామ పండ్లు మాత్రమే కాదు జామ ఆకులు సైతం మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.
వెయిట్ లాస్ నుంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ వరకు ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తాయి.
మూడు లేదా నాలుగు ఫ్రెష్ జామ ఆకులు ఒక గ్లాస్ వాటర్ లో ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ జామ ఆకుల వాటర్ ను రోజుకు ఒక కప్పు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.నోటి నుంచి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు, మౌత్ అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి.జామ ఆకుల నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా కూడా మారుతుంది.
అలాగే హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్నవారు జామ ఆకులను మరిగించిన వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు గోరింటాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, వన్ టేబుల్ స్పూన్ మందారం పువ్వుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారంలో ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.
అదే సమయంలో కురులు ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా పెరుగుతాయి.
మొండి మచ్చలను వదిలించడానికి కూడా జామ ఆకులు గ్రేట్ గా సహాయపడతాయి.రెండు జామ ఆకులతో పాటు నాలుగైదు తులసి ఆకులు తీసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే ఎంతటి మొండి మచ్చలు అయినా సరే క్రమంగా మాయమవుతాయి.