పెదనాన్న లేకపోతే నేనులేను.... కృష్ణంరాజును గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన ప్రభాస్!

ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఈయన ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు అంటే అందుకు గల కారణం తన పెదనాన్న కృష్ణంరాజు అని చెప్పాలి.

కృష్ణంరాజుకు కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ ను తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసి అనుక్షణం తన వెంటే ఉంటూ తనని ధైర్యంగా ముందుకు నడిపించి నేడు ఈ స్థానంలో నిలబెట్టారు.ఇలా ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు ఊహించిన స్థాయిని మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇకపోతే కృష్ణంరాజు గారు సెప్టెంబర్ 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ప్రభాస్ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మరొక హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నారు.ఇప్పటికే ఒక ఎపిసోడ్ ప్రసారం కాగా జనవరి ఆరవ తేదీ మరొక ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Advertisement

అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.ఈ ప్రోమోలో భాగంగా కృష్ణంరాజు గురించి బాలకృష్ణ ప్రస్తావించడమే కాకుండా ఆయన స్పెషల్ ఏవి కూడా చూపించారు.

ఈ కార్యక్రమంలో ప్రభాస్ గోపీచంద్ బాలకృష్ణ ముగ్గురు కృష్ణంరాజు గారికి నివాళులు అర్పించారు.

బాలకృష్ణ ప్రభాస్ ని ప్రశ్నిస్తూ కృష్ణంరాజు గురించి చెప్పమని అడగడంతో ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు.నేడు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు గల కారణం పెదనాన్న గారేనని, ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.ఇక ఆయనని మా కుటుంబం చాలా మిస్ అవుతుంది అంటూ ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఆయన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని అయితే ఆ సమయంలో నేను తన పక్కన లేకపోయినా నిరంతరం వైద్యులతో మాట్లాడుతూ వారితో టచ్ లో ఉన్నానని ఈ సందర్భంగా ప్రభాస్ తన పెదనాన్న గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement
" autoplay>

తాజా వార్తలు