కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వలనే టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడుకు నిధులు విడుదల చేస్తుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
అనంతరం మునుగోడులో ప్రభుత్వం చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. కేసీఆర్ మోసపు మాటలను, అసత్య ప్రచారాలను ప్రజల ఇంకా నమ్మరని తెలిపారు.
మునుగోడులో బీజేపీ జెండానే ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.