తెలుగులో విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందిన నటుడు సుమన్.అప్పట్లో దాదాపుగా చిరంజీవి, బాలకృష్ణ, శోభన్ బాబు వంటి వాళ్లకి మంచి పోటీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సుమన్.
అయితే ఓ పక్క సినిమాల్లో రాణిస్తూనే మరోపక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి తన సేవలను అందిస్తున్నాడు.అంతేగాక సహాయం కావాలని కోరితే లేదనుకుందా తన వంతు సాయం చేసే మంచి మనసును నటుడిగా సుమన్ తెలుగు సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్నాడు.
అయితే తాజాగా సుమన్ గుంటూరు మాజీ శాసనసభ్యుడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా సుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నాడని, అంతేగాక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు.
అలాగే తనకు అవకాశం కల్పిస్తే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.
దీంతో పరోక్షంగా సుమన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ నేతల పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు.అయితే ఇదిలా ఉండగా రాష్ట్రంలో వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి సుమన్ పార్టీలోని కొంత మంది నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు.దీంతో సుమన్ తొందర్లోనే వైసిపి పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.