సూర్యాపేట జిల్లా( Suryapet District ) హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని ఉస్మానియా మస్జీద్ (మర్కస్)లో శుక్రవారం ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ) అధికారంలో ఉన్నామనే భావనతో ముస్లిం వక్ఫ్ ఆస్తులలో జోక్యం చేసుకుంటూ పెత్తనం చెలాయించడం తగదని మండిపడ్డారు.
తప్పుడు పత్రాలు సృష్టించి వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్న ఉస్మానియా మస్జీద్ కాంప్లెక్స్( Osmania Masjid Complex ) లోని 5వ నెంబర్ దుకాణ కిరాయిదారురాలు దామెర్ల భూలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,ఆ దుకాణాన్ని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకొని నోటిఫికేషన్ ద్వారా నిబంధనల ప్రకారం అర్హులైన ముస్లింలకు కేటాయించాలని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేసిందని తెలిపారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేటి వరకు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తుల జోలికి వచ్చిన ఎమ్మెల్యే లేడని,బినామీ పేరుతో హుజూర్ నగర్ ఉస్మానియా మసీద్ వక్ఫ్ కాంప్లెక్స్ లోని 5వ నెంబర్ దుకాణదారుని పేరును అక్రమ మార్పిడికి సిద్ధపడి వక్ఫ్ ఆస్తులు ఆక్రమించడానికి రంగం సిద్ధం చేసిన వారికి వత్తాసు పలుకుతూ వక్ఫ్ బోర్డు నిబంధనలు తెలియకుండా ఎమ్మెల్యే సైదిరెడ్డి రికమండేషన్ లెటర్ ఇవ్వడాన్ని వారు తప్పుపడుతూ తీవ్రంగా ఖండించారు.
ముస్లిం మైనార్టీల ఆస్తులు,వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసేవారిపై పోరాటానికి నియోజకవర్గ ముస్లింలందరూ
.