సాధారణంగా ప్రతి మనిషికి ఒక సెంటిమెంట్ ఉంటుంది.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
టైటిల్ పేరు ఫలానా అక్షరంతోనే మొదలవ్వాలి, ఈ సినిమాలో ఈ హీరోయిన్ మాత్రమే ఉండాలి , స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసిన తర్వాత కచ్చితంగా ప్లాప్ వస్తుంది అంటూ కొన్ని సెంటిమెంట్లు ఇండస్ట్రీలో ఉన్నాయి.అయితే తాజాగా సెంటిమెంట్ల గురించి మహేష్ బాబు అభిమానులు చాలా కలవర పడుతున్నారు.
మహేష్ బాబు విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉంది.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి.11 ఏళ్ల తర్వాత మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది.ఇటీవల సర్కారు వారి పాట సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన 28 వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు.
ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు.మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 11 ఏళ్ల తర్వాత సినిమా వస్తుండటంతో మహేష్ బాబు అభిమానుల్లో ఒకవైపు ఆనందం ఉన్నప్పటికీ.
మరొకవైపు సెంటిమెంట్ వారిని కలవరపెడుతోంది.
అసలు విషయానికి వస్తే. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అతడు.ఈ సినిమా థియేటర్లలో విడుదల అయినప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
కానీ ఇదే సినిమా బుల్లితెరలో ప్రసారం అయినప్పుడు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా అప్పుడు ఎందుకు హిట్ కాలేకపోయింది అంటూ ఆలోచనలో పడ్డారు.
తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమా కూడా మొదట నిరాశ పరిచింది.కానీ టీవీలో చూసిన తర్వాత.
ఇంత మంచి సినిమా థియేటర్ లో ఎందుకు హిట్ అవ్వలేక పోయిందా అని అంతా ఆలోచనలో పడ్డారు.అయితే ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా విషయంలో ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.
మరి మునుపటిలాగే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రేక్షకులను నిరాశ పరుస్తుందా? లేక ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి సూపర్ హిట్ అవుతుందో చూడాలి మరి.