నేనేమైనా గుమ‌స్తానా.. బాబుపై టీడీపీ ఎమ్మెల్యే అస‌హ‌నం..!

అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు అవ‌లంభించిన తీరుకు, ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడుగా ఆయ‌న అవ‌లంభిస్తున్న తీరుకు చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.అధికారంలో ఉన్న ‌ప్పుడు కొన్ని వ‌ర్గాలను, కొంద‌రు నాయ‌కుల‌ను మాత్ర‌మే చంద్ర‌బాబు చేర‌దీశారు.

 Will I Observe,,that Tdp Mla Upset On Chandra Babu, Chandra Babu, Kondapi Mla Ba-TeluguStop.com

అంతేకాదు.త‌న అను కున్న వారికి మాత్ర‌మే ప‌ద‌వులు ఇచ్చారు.

దీంతో సీనియ‌ర్ల‌కు చాలా వ‌ర‌కు అన్యాయం జ‌రిగింద‌నే టాక్ వినిపించింది.ఇదే.గత ఏడాది ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్క‌లేక పోవ‌డానికి దారి తీసింద‌నే చ‌ర్చ కూడా ఉంది.దీనిపై ఇట‌వ‌ల కాలంలో కొంత క‌స‌ర‌త్తు చేసిన చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీలో ఎక్క‌డా లేని విధంగా పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల జిల్లాల ఇంచార్జ్ ప‌ద వుల‌ను సృష్టించారు.నేత‌ల‌కు పార్టీలో ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.ఇక‌, పార్టీ పొలిట్ బ్యూరోలో స‌భ్యుల సంఖ్య‌ను పెంచేశారు.దీనిలోనూ అనేక మందికి అవ‌కాశం ఇచ్చారు.

ఇక‌, మ‌హిళా క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు.నియోజ‌క‌వ‌ర్గాల స్థాయి క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఇక‌, మండ‌ల స్థాయి క‌మిటీల‌ను త్వ‌ర‌లోనే ఏర్పాటు చేయాల‌ని భావించారు.ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.

నేత‌ల సంఖ్య‌, క‌మిటీల సంఖ్య పెరిగి పోయింద‌నే టాక్ వినిపించింది.అస‌లు నేత‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోయినా.

ఇంత సంఖ్య‌లో ప్రాధాన్యం పెంచేసినా.క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ టాక్ ఇలా ఉండ‌గానే.మ‌రికొంద‌రికి కూడా ప‌ద‌వులు ఇస్తూ.స‌రికొత్త ప‌ద‌వులు సృష్టించారు.పార్ల మెం టు నియోజ‌క‌వ‌ర్గాల ను ఐదేసి చొప్పున క‌లిపి.

ఒక ఇంచార్జ్‌ను నియ‌మించారు.అంటే.

మొత్తంగా మ‌రో ఐదుగురికి ఈ కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించారు.అయితే.

ఈ ఐదుగురిలో ముగ్గురు ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీలోకానీ, అటు పార్ల‌మెంటులో కానీ.అడుగు పెట్టిన వారు లేక పోవ‌డంతో.

వీరికి పార్ల‌మెంటు స్థాయి రాజ‌కీయాలు ఏం తెలుస్తాయ‌ని త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది.ఇక‌, కొండ‌పి ఎమ్మెల్యే బాల వీరాంజ‌నేయ స్వామికి వింతైన ప‌ద‌విని కట్ట‌బెట్టారు.

Telugu Ap, Chandra Babu, Incharge, Tdp, Tdp Mla, Upset-Telugu Political News

పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి నాయ‌కులు పంపించే నివేదిక‌ల‌ను అధ్య‌య‌నం చేసే ఇంచార్జ్ ప‌విని అప్ప‌గించారు.దీనిపై నేరుగా ఆయ‌నే పెద‌వి విరుస్తున్నారు.నేనేమైనా గుమ‌స్తానా? అంటూ.కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు.

మ‌రి ఇలా ప‌ద‌వుల పందేరం చేయ‌డం వ‌ల్ల పార్టీ కి ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో అర్థం కావ‌డం లేద‌ని సీనియ‌ర్లు అంటున్నారు.అంతేకాదు.

ఎక్క‌డిక‌క్క నేత‌ల మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తే.ప‌రిస్తితి ఏంట‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube