ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) రసవత్తరంగా సాగుతుంది.ఇప్పటికే అన్ని టీములు కూడా తమ ఓపెనింగ్ మ్యాచ్ ని ఆడాయి.
అందులో కొన్ని టీములు మంచి విజయాలను సాధిస్తే, మరికొన్ని టీమ్ లు మాత్రం ఓడిపోయి వాళ్ల అభిమానులకి కొంతవరకు నిరాశను మిగిల్చాయి.అయిన కూడా ఆ టీమ్ లు అన్ని కూడా ఎక్కడ తగ్గకుండా తర్వాత జరగబోయే మ్యాచ్ ల్లో తమ సత్తాను చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే చెన్నై టీమ్ మాత్రం తను ఆడిన రెండు మ్యాచ్ ల్లో మంచి విజయాలను సాధించి పాయింట్స్ టేబుల్లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే చెన్నైకి గుజరాత్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై( Chennai Super Kings ) విజయం సాధించింది.ముఖ్యంగా ఈ టీం లో శివం దూబే( Shivam Dube ) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి కీలకపాత్ర వహించాడనే చెప్పాలి.చెన్నై టీం తరఫున ప్రతి మ్యాచ్ లో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న ఇప్పుడు జరిగిన రెండు మ్యాచ్ ల్లో కూడా చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు.
ఆయన ఎప్పుడూ కూడా ప్రేక్షకుల్ని గాని అటు వాళ్ళ టీం మెంబర్స్ గాని అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు.శివం దుబే టీమ్ లో ఉన్నంతవరకు చెన్నై టీం కి ఓటమి లేదు అని సోషల్ మీడియాలో చాలామంది చెన్నై టీమ్ అభిమానులు చాలా గర్వంగా చెబుతున్నారు.
ఇక మరికొందరు మాత్రం ఈసారి కూడా చెన్నై దే కప్పు అంటూ సోషల్ మీడియా( Social media) మొత్తం ఒక న్యూస్ ని వైరల్ చేస్తున్నారు.
అయితే అది చూసిన చాలామంది చెన్నై టీం ఇదే పర్ఫామెన్స్ కనక ఇచ్చినట్టైతే ఈసారి కూడా కప్పు కొడుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక అలాగే చెన్నైలో బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది.ఇప్పటికే మతిషాపతిరానా, దీపక్ చాహర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్లు వాళ్లు బౌలింగ్ తో ప్రత్యర్థి ప్లేయర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు.రవీంద్ర జడేజా లాంటి స్పిన్నర్ కూడా ప్రత్యర్థి ప్లేయర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు…