అమిత్ షా వచ్చి ప్రమాణం చేస్తారా.? బీజేపీకి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నలు

బీజేపీపై టీఆర్ఎస్ మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు.యాదాద్రిలో బండి సంజయ్ ను ఎవరు ప్రమాణం చేయమన్నారని ప్రశ్నించారు.

అమిత్ షా మాటలను నిజం చేసేందుకు యత్నించి దొరికిపోయారని ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా వచ్చి ప్రమాణం చేస్తారా అని నిలదీశారు.

గుమ్మడికాయల దొంగలు ఎవరంటే బీజేపీ ఎందుకు భుజాలు తడుముకుంటోందని అడిగారు.మా వాళ్లు దొంగల్ని పట్టుకోవడంలో విజయం సాధించారంటూ హర్షం వ్యక్తం చేశారు.

బీజేపీ కుట్రను తమ పార్టీ ఎమ్మెల్యేలు బయట పెట్టారని పేర్కొన్నారు.అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో మాటల యుద్ధం కొనసాగుతోంది.

రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు : పవన్ కళ్యాణ్
Advertisement

తాజా వార్తలు