తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరీని రెండు కండ్లు గా అభివర్ణిస్తూ ఉంటారు.ఇక వీళ్ళ కాంబినేషన్ లో అప్పట్లో చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక వీళ్లిద్దరు కలిసి చేసిన ‘గుండమ్మ కథ’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.అయితే ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ అది వర్కౌట్ కాలేదు.
ఇక ఈ సినిమాలో హీరోలుగా ఎన్టీఆర్( Jr NTR ) నాగచైతన్యలను( Naga Chaitanya ) పెట్టి సినిమా చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ అది ఎంతవరకు వర్కౌట్ అయితే కాలేదు.నిజానికి ఎన్టీఆర్( Sr NTR ) మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ ని, నాగేశ్వరరావు( Nageswara Rao ) మనవడిగా నాగచైతన్య ఇద్దరు కలిసి ఈ సినిమాని చేస్తే వాళ్ల అభిమానులు కూడా ఆనందం తో ఉండేవారు.అలాగే ఈ సినిమాతో కూడా వాళ్లకు మంచి సక్సెస్ లు దక్కేవి అని చాలా మంది సినీ విమర్శకులు సైతం ఈ సినిమా మీద మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్, నాగచైతన్య ఈ సినిమాను చేస్తే ఇమేజ్ పరంగా తేడా వస్తుందనే ఉద్దేశ్యం తోనే ఎన్టీఆర్ ఈ సినిమాని చేయడం లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి.మరి ఫ్యూచర్ లో అయిన ఈ సినిమా పట్టా లెక్కుతుందో లేదో అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే…ఇక ఇదీ ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా( Devara ) చేస్తూ బిజీగా గడుపుతుంటే, నాగచైతన్య మాత్రం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్( Thandel ) అనే సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం వీళ్లిద్దరు ఈ సినిమాల మీద భారీ ఆశలు పెట్టుకున్నారు…
.