కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత ప్రస్తుతం ఇండియన్ బాక్సాపీస్ వద్ద పోటీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.భాషతో సంబంధం లేకుండా అందరు హీరోల సినిమాలను అన్ని భాషల్లో విడుదల చేస్తూ ఇక బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు.
ఈ క్రమంలోనే కరోనా వైరస్ తర్వాత మొదటిసారి బాక్సాఫీసు వద్ద ఒకేసారి మూడు సినిమాలు విడుదలయ్యాయి.టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ నుంచి విడుదలైన మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం.
ఇక మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి మంచి వసూళ్లు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
ఇలా మూడు ఇండస్ట్రీల నుంచి విడుదలైన ఈ మూడు సినిమాలు అస్సలు సంబంధం లేని వేర్వేరు జోనర్ లో ఉండడం గమనార్హం.
మూడు సినిమాలు ఇలా ఒకే రోజు విడుదలై పాజిటివ్ సొంతం చేసుకొని హిట్టు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు అనే చెప్పాలి.టాలీవుడ్లో అడవి శేష్ మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే కోలీవుడ్ లో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో హిట్ కొట్టాడు.
బాలీవుడ్లో అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ తో హిట్టు కొట్టడం గమనార్హం.
అయితే అటు అడ్వాన్స్ బుకింగ్లో మాత్రం మేజర్ విక్రమ్ తర్వాత అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ సినిమా నిలిచింది అని తెలుస్తోంది.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేషు మేజర్ సినిమా తెరకెక్కిస్తే.డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో అటు కమలహాసన్ విక్రమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అదే సమయంలో అక్షయ్ కుమార్ పృథ్వి రాజ్ సినిమాలో సినిమాటోగ్రఫీ తో పాటు టెక్నికల్ అంశాలు కలిసొచ్చాయి.ఇలా ఒకే రోజు విడుదలైన మూడు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని హిట్ కొట్టడం చూస్తూ ఉంటే చిత్రపరిశ్రమకు కరోనా తర్వాత మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి అని అందరూ ప్రేక్షకులు భావిస్తున్నారు.