శ‌త్రువుల‌తో మాట్లాడింద‌ని భార్య‌ను ఆ భ‌ర్త ఏం చేశాడంటే..

కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తుంటే అస‌లు వీళ్లు మ‌నుషులేనా అనిపిస్తుంది.వాటిని ఎక్క‌డ జ‌రిగినా స‌రే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డం అనేది చాలా కామ‌న్ అయిపోయింది.

ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అదేంటంటే త‌న భార్య శత్రువు కుటుంబసభ్యులతో మాట్లాడిందని ఆ భ‌ర్త ఆమెను క‌ర్ర‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టాడు.

అయితే ఈ దారుణ‌మైన ఘటన గుజరాత్‌లోని దహోద్‌ జిల్లాలో జ‌ర‌గ్గా కొంచెం లేటుగా వెలుగులోకి వ‌చ్చింది.ఈ ఘ‌ట‌న‌ను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా త‌న కథనం ద్వారా వెలుగులోకి తీసుకువ‌చ్చింది.

ఈ జిల్లాలో నివాసం ఉంటున్న మకి మఖ్లా వాల్వాయ్‌ అనే బాధితురాలిపైనే ఈ దాడి జ‌రిగింది.విష‌యం ఏంటంటే ఈ బాధిత మహిళ కుటుంబానికి అలాగే వీరికి ద‌గ్గ‌ర‌లో ఉండే భదోర్‌ కుటుంబానికి పెద్ద ఎత్తున ఆస్తి విభేదాలు ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ కార‌ణాల‌తో వీరిద్ద‌రి కుటుంబాలు మాట్లాడుకోవటం మానేశాయి.కాగా ఓ సంద‌ర్భంలో కొన్ని రోజుల క్రితం మకి భదోర్‌ కుటుంబ స‌భ్యుల‌తో ఏదో విష‌య‌మై మాట్లాడిందంట‌.

ఇక ఆమె త‌న శ‌త్రువు కుంటంబంతో మాట్లాడిన విష‌యం కాస్తా త‌న భ‌ర్త‌కు సోమవారం తెలిసింది.

ఇక ఆయ‌న కోపంతో ఊగిపోయి ఆమెను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకుంటూ వ‌చ్చి కింద ప‌డేశాడు.అత‌నితో కావ‌ట్లేద‌ని మరో ముగ్గురు కుటుంబసభ్యుల స‌హ‌కారం తీసుకుని మ‌రీ భార్య‌పై కర్రతో దారుణంగా దాడి చేశారు.ఇక ఆ మ‌హిళ‌పై కుటుంబ స‌భ్యులు దాడి చేస్తున్నార‌ని తెలుసుకున్న భదోర్‌ కుటుంబం వ‌చ్చి ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫ‌లితం లేకుండా పోయింది.

ఇక ఈ దారుణ‌మైన దాడిలో మకికి తీవ్ర‌మైన గాయాలు అయ్యాయి.ఇక మకి కొడుకు సురేష్‌ వాల్వాయ్ దాడి చేసిన వారిపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ‌ల్ఇ ఫిర్యాదు చేయ‌గా వారు ద‌ర్క‌యాప్తు చేస్తున్నారు.

ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?
Advertisement

తాజా వార్తలు