టీడీపీ – జనసేన( TDP , Janasena ) తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రంగా మండిపడ్డారు.టీడీపీ, జనసేనది జెండా సభ కాదు.
జెండాల సభ అని ఎద్దేవా చేశారు.సీఎం జగన్( CM Jagan ) ను తిట్టడానికే జెండాల సభ పెట్టినట్లుందన్నారు.
మూడో జెండా కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు.టీడీపీ – జనసేనకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పలేకపోయారని పేర్కొన్నారు.
అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు.టీడీపీ – జనసేనకు ప్రజల సంక్షేమం పట్టదన్న పేర్ని నాని తన వద్ద సమాచారం ఉందని పవన్ కల్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.దమ్ముంటే ఆ సమాచారం ఏంటో బయటపెట్టాలన్నారు.యుద్ధం చూపిస్తానంటున్న పవన్ 2014, 2019 లో ఏం చేశారని ప్రశ్నించారు.గతంలో అమరావతి( Amaravati )పై పవన్ విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు అమరావతే రాజధాని అంటున్నారని తెలిపారు.వామనుడి కథ ప్రకారంం పవన్ తొక్కాల్సింది చంద్రబాబునేనని వెల్లడించారు.