ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో విచిత్ర వాతావరణ నెలకొంది.రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ దృష్టి సారించారు.
ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు జనాల్లో ఉండే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది.
ప్రధాన ప్రతిపక్షం టిడిపి గతంతో పోలిస్తే బాగా యాక్టివ్ అయ్యింది జనసేన కూడా జనాల్లో బలం పెంచుకునే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.వైసిపి ప్రభుత్వ విధానాలపైన జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన తరచుగా టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు, మిగతా టిడిపి నాయకులంతా యాక్టీవ్ అయ్యారు.
తరచుగా జగన్ ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే టిడిపి ఇస్తున్న కౌంటర్లకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి , మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు మాత్రమే స్పందిస్తున్నారు కానీ వైసీపీ మంత్రులు ఎవరు టిడిపి విమర్శలపై పెద్దగా స్పందించడం లేదు.తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
కొత్తగా వైసిపి మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులంతా తమ కార్యాలయం వదిలి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.అంతే కాదు ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు .దీనికి కారణం ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడా దీనికి కారణంగా కనిపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొనడం , తమకు ఎన్నికల సమయం నాటికి టికెట్ దక్కకపోతే వేరే పార్టీలోకి తప్పనిసరిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటి నుంచి అనవసరంగా విమర్శలు చేస్తే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతో చాలామంది మంత్రులు ఉన్నారట.ఇటీవల ఏపీ సీఎం జగన్ మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకూన్నారట.అందులో మంత్రుల పనితీరు అంతంత మాత్రంగా ఉన్నట్టుగా తేలిందట.
దీని అంతటికి కారణం మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేల ఆలోచనలు మారడమే కారణమట.అందుకే అంత యాక్టీవ్ గా ఉండేందుకు ఇష్టపడడం లేదట.