ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక్కటేనని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.గ్రామాలకు నిధులు ఇవ్వకుండా కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
ఏకగ్రీవమైన పంచాయతీలకు కేసీఆర్ నయా పైసా ఇవ్వలేదన్నారు.కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
పద్మశాలీలకు ఖాదీ బోర్డు ఛైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పారు.బీజేపీకి అవకాశం ఇస్తే పేదోళ్ల రాజ్యం తెస్తామని స్పష్టం చేశారు.