ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్( CM Jagan ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన 20 వేల 840 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చామన్న ఆయన విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.పేదలకు ఓ న్యాయం, పెద్దవారికి ఓ న్యాయం అనే విధానాన్ని మార్చేశామని పేర్కొన్నారు.
గతంలో పేదలకు గవర్నమెంట్ బడులు, డబ్బున్న వారికి ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉండేదన్నారు.కానీ ఇప్పుడు పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అందుతోందన్నారు.దాంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో బైజూస్ ( Byjus )కంటెంట్ ను తీసుకువచ్చామన్నారు.ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్ లు, డిజిటల్ బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు.అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామని తెలిపారు.వైద్య, ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని సీఎం జగన్ వెల్లడించారు.