CM Jagan : పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం..: సీఎం జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్( CM Jagan ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన 20 వేల 840 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

 We Have Brought Reforms In The Administration Cm Jagan-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చామన్న ఆయన విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.పేదలకు ఓ న్యాయం, పెద్దవారికి ఓ న్యాయం అనే విధానాన్ని మార్చేశామని పేర్కొన్నారు.

గతంలో పేదలకు గవర్నమెంట్ బడులు, డబ్బున్న వారికి ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉండేదన్నారు.కానీ ఇప్పుడు పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అందుతోందన్నారు.దాంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో బైజూస్ ( Byjus )కంటెంట్ ను తీసుకువచ్చామన్నారు.ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్ లు, డిజిటల్ బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు.అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామని తెలిపారు.వైద్య, ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని సీఎం జగన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube