ప్రమాదం ఎటు వైపు నుండి పొంచి ఉంటుందో ఊహించడం చాలా కష్టం.రోడ్డుపై వెళ్తున్నప్పుడు మరీ ముఖ్యంగా.
చిన్న పాటి నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది.ఒకరు చేసిన పొరపాటు వారి జీవితాన్ని వారి కుటుంబ సభ్యుల జీవితాన్ని కుదిపేస్తుంది.
అందుకే రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు.రిక్తపాటు నిర్లక్ష్యం కూడా ప్రాణాలను తీస్తుందని అధికారులు హెచ్చరిస్తుంటారు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎదుటి వారి నిర్లక్ష్యం కూడా మన ప్రాణాలను తీస్తుంది.వారు నిబంధనలు పాటించకుండా వెళ్లడం వల్ల మన బతుకులు కూలి పోతాయి.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో అలాంటి ఘటనే జరిగింది.ఒకరు చేసిన నిర్లక్ష్యానికి మరొకరు బలి అయ్యారు.రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయారు.ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ మహిళ.
తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకుంటుందని ఆ కుటుంబసభ్యుల వేచి చూపులు ఎప్పటికీ తీరవేమో.
ఓ మహిళ స్కూటీపై రోడ్డుకు ఎడమ వైపు నుండి వెళ్తోంది.
తలకు హెల్మెట్ కూడా ధరించి అన్ని నిబంధనలు పాటిస్తూ వెళ్తోంది.కానీ వాటర్ ట్యాంకర్ రూపంలో మృత్యువు ఆమెను బలితీసుకుంది.
స్కూటీపై ముందుకు వెళ్తున్న మహిళపై నుండి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటన బెంగళూరులోని లగ్గరె బస్టాండ్ సమీపంలో జరిగింది.
మృతురాలిని ఆశ అనే మహిళగా గుర్తించారు అధికారులు.ఆమె కిమ్స్ దవాఖానాలో నర్సుగా పని చేస్తోంది.
వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ఫోన్ చూస్తూ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు.