దీపావళికి ముందే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!

సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం భక్తులు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.

అయితే దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో డబ్బుకు కోదవే ఉండదని పండితులు చెబుతున్నారు.మరి ఈ రోజు లక్ష్మీ దేవి( Lakshmi Devi )ని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని పనులను చేయాలి.

దీపావళిని భారత దేశంలో ఎంతో మధురంగా జరుపుకుంటారు.దీపాలు వెలిగించి టపాకాయలు కలుస్తారు.

అంతే కాకుండా ఈ రోజు లక్ష్మీదేవికి నియమ నిష్టగా పూజలు కూడా చేస్తారు.అందుకే ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.

Advertisement

ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే ఇంట్లో డబ్బుకు కోదవే ఉండదు అని చెబుతున్నారు.

అలాగే ఆదాయం కూడా పెరుగుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు,ఆరోగ్యం కోసం దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.మీరు కూడా ఆర్థిక సమస్యల( Financial problems )తో బాధపడుతున్నారా? అయితే వీటి నుంచి బయటపడడానికి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు.సంపద దేవత అయిన లక్ష్మీదేవి దీపావళి రోజు భూలోకానికి వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

మరి ఈ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మత విశ్వాసాల ప్రకారం దీపావళికి ముందే మీ ఇంటినీ శుభ్రం చేసుకోవాలి.ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారు.

లక్ష్మీదేవికి శుక్రవారం అంకితం చేయబడింది.అందుకే ఆ రోజు అమ్మవారిని పూజిస్తారు.అయినప్పటికీ దీపావళి రోజు కూడా లక్ష్మీదేవిని పూజించాలి.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై31, బుధవారం 2024

దీని వల్ల మీ సిరి సంపదలు పెరుగుతాయి.లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే దీపావళి రోజు లక్ష్మీదేవి పూజలో అమ్మవారి మంత్రాలను పఠించాలి.

Advertisement

అలాగే అమ్మవారికి తామర పువ్వు( Lotus Flower ) అంటే ఎంతో ఇష్టం.అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించాలి.

దీని వల్ల అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది.అలాగే దీపావళికి తులసి పూజ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు.

అందుకే ఈ రోజు తులసి మాత ముందు నెయ్యి దీపం వెలిగించాలి.దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

ఇంకా చెప్పాలంటే దీపావళి రోజు లక్ష్మీదేవితో పాటు శ్రీమహా విష్ణువు( Lord Vishnu )ని కూడా పూజించాలి.దీని వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.

తాజా వార్తలు