ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీ ఎయిర్టెల్ ఇపుడు తన వినియోగదారుల కోసం అపరిమితంగా 5జీ డేటాను ఉచితంగా ఇస్తానంటోంది.అయితే దీని వెనకాల కొన్ని షరతులు వున్నాయండోయ్.
అర్హులైన యూజర్లు అపరిమితంగా 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.ఇక 5జీ ప్లస్ నెట్వర్క్ అనేది సాధారణ ఇంటర్నెట్తో పోలిస్తే 30 రెట్లు వేగంగా ఉంటుంది.
అయితే అన్లిమిటెడ్ ఫ్రీ 5జీ డేటా( 5G data ) అనేది కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్ ఏం కాదు.ఇప్పటికే జియో వినియోగదారులకు ఈ వెసులుబాటు కలదు.
ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే యూజర్ల వద్ద కచ్చితంగా 5జీ ఫోన్ ఉండాలి.ఆ తరువాత 5జీ ఫోన్( 5G phone )లో ఎయిర్టెల్ సిమ్ వేసుకొని తీరాలి.ఆ తర్వాత ఎయిర్టెల్ థ్యాంక్స్( Airtel Thanks ) అయినటువంటి ‘మై ఎయిర్టెల్ యాప్‘ డౌన్లోడ్ చేసుకోవాలి.మై ఎయిర్టెల్ సంస్థ తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన యాప్ ఇది.అందులో ఖాతా వివరాలు, అమలులో ఉన్న ప్లాన్లు, డేటా వినియోగం వంటి సమాచారం ఉంటుంది.ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది.
నెలకు రూ.239 లేదా అంతకుమించిన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న వారికే ఈ ఉచిత ‘5జీ ప్లస్‘ డేటా లభిస్తుందని స్పష్టం చేయడం కొసమెరుపు.ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులిద్దరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది.అయితే రూ.455, రూ.1799 ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదని చాలా క్లియర్ కట్ గా ఎయిర్టెల్ చెబుతోంది.ఇదే కాకుండా, మరో షాకింగ్ నిబంధన పెట్టింది.ఫ్రీ 5జీ డేటాను యూజర్లు తమ ఫోన్లలో మాత్రమే వినియోగించుకునేలా రూల్ కూడా ఒకటి పెట్టింది.పీసీకి కానీ, ల్యాప్టాప్కు కానీ అనుసంధానం చేసి డేటా షేర్ చేసుకోలేరని ఎయిర్టెల్ వెల్లడించడం కొసమెరుపు.