మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.విచారణ దశలో ప్రధాన నిందితుడు బెయిల్ పై ఉండటం సరైంది కాదని సీబీఐ పేర్కొంది.
ఇప్పటికే ఎర్ర గంగిరెడ్డికి సీబీఐ వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.90 రోజుల్లో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో గతంలో గంగిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.వివేకా హత్యలో గంగిరెడ్డి ప్రధాన నిందితుడని సీబీఐ చెబుతోంది.ఈ మేరకు గంగిరెడ్డి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరింది.హత్య తరువాత గంగిరెడ్డి వివేకా ఇంటి నుంచి తప్పించుకున్నాడని పేర్కొంది.