దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రజలకు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) బంపరాఫర్ ప్రకటించింది.ఆగస్టు 5 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా అన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలకు ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది.‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, 75వ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భాగంగా చారిత్రక, పర్యాటక ప్రాంతాలలో ఉచిత సందర్శనకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రి జి కిషన్రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. తాజ్మహల్, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు, మ్యూజియాలను ప్రజలు ప్రవేశ రుసుము లేకుండా సందర్శించే అవకాశం కలిగింది.
ఏఎస్ఐ ఆగ్రా సర్కిల్ ఆగస్ట్ 8 నుండి 15 వరకు 40 స్మారక చిహ్నాల వద్ద ‘స్వచ్ఛత’ ప్రచారాన్ని కూడా నిర్వహించనుంది.ఆగ్రా కోట, సికంద్రాలోని అక్బర్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, ఇత్మద్-ఉద్-దౌలా కూడా ఆగస్టు 5 నుండి ఆగస్టు 15 వరకు ఉచితంగా చూడొచ్చు.
దేశవ్యాప్తంగా 3,650 కంటే ఎక్కువ పురాతన నిర్మాణాలు, పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాలు ప్రస్తుతం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.వీటి వద్ద ఉచిత సందర్శనకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
ఈ స్మారక చిహ్నాలు వివిధ భౌగోళిక అమరికలలో కనుగొనబడ్డాయి.చరిత్రపూర్వ కాలం నుండి వలసరాజ్యాల కాలంతో సహా వివిధ చారిత్రక యుగాల నాటివి.
పురాతన స్థావరాలు, అలాగే దేవాలయాలు, మసీదులు, సమాధులు, చర్చిలు, స్మశానవాటికలు, కోటలు, రాజభవనాలు, మెట్ల బావులు, రాక్-కట్ గుహలు మరియు లౌకిక వాస్తుశిల్పం యొక్క రుజువులను చూపించే పురాతన మట్టిదిబ్బలు, ప్రదేశాలు ఉన్నాయి.చారిత్రక కట్టడాలన్నింటినీ భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంటాయి.
ఫలితంగా వాటి సంరక్షణకు అవసరమయ్యే నిధులను సందర్శకుల నుంచి ప్రవేశ రుసుము పేరిట వసూలు చేస్తారు.అయితే 75 ఏళ్ల స్వతంత్ర భారతావని వేడుకల్లో భాగంగా ఆ ప్రవేశ రుసుము లేకుండా 3650 కంటే ఎక్కువ పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ఉచితంగా చూసే అవకాశం కేంద్రం కల్పిస్తోంది.