'డీజే టిల్లు' సినిమాని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..? భలే ఛాన్స్ మిస్ అయ్యాడుగా!

గత ఏడాది కరోనా మూడవ లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే విడుదలైన చిత్రం సిద్ధూ జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) హీరోగా నటించిన డీజీ టిల్లు.

విడుదలకు ముందే పాటల ద్వారా మంచి అంచనాలను ఏర్పాటు చేసిన సినిమా, విడుదల తర్వాత మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ ఈ సినిమాకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు.ఇప్పటికీ ఈ సినిమాని ఖాళీ దొరికినప్పుడల్లా టైం పాస్ కోసం చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు.

తెలంగాణ యాస లో సిద్దు జొన్నలగడ్డ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయించాయి.ఆయన కామెడీ టైమింగ్ కి కూడా ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

అప్పటి వరకు ఒకటి రెండు సినిమాల్లో హీరో గా నటించిన సిద్దు కి పెద్ద గుర్తింపు రాలేదు కానీ, ఈ సినిమాతో మాత్రం ఆయన యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

Advertisement

ఈ సినిమాకి కథ , మాటలు మరియు స్క్రీన్ ప్లే రాసుకున్నది సిద్దు జొన్నలగడ్డ అనే విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమా ద్వారా ఆయనలోని ఎన్నో టాలెంట్స్ ని బయటపెట్టాడు.వాస్తవానికి ఈ సినిమాలో తొలుత సిద్దు నటించాలని అనుకోలేదట.

ఇండస్ట్రీ లో తనకి ఎంతో ఆప్తమిత్రుడు అయిన యంగ్ హీరో విశ్వక్ సేన్ ని( Vishwak Sen ) హీరో గా పెట్టి తీద్దాం అనుకున్నాడట.విశ్వక్ సేన్ కి కాన్సెప్ట్ తెగ నచ్చేసింది.

ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని చాలా కోరికతో ఉన్నాడు కానీ, అదే సమయం లో ఆయన రెండు మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన షెడ్యూల్స్ నిర్మాతలు ప్లాన్ చెయ్యడం తో, డీజే టిల్లు కి డేట్స్ కేటాయించలేకపోయాడట.దీనితో ఈ చిత్రం లో సిద్దు జొన్నలగడ్డనే హీరో గా చేసి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నాడు.

గత ఏడాది ఫిబ్రవరి ప్రారంభం లో విడుదలైన ఈ సినిమా 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 7 కోట్ల రూపాయిలు మాత్రమే, నిర్మాతలకు దాదాపుగా మూడింతల లాభాల్ని తెచ్చి పెట్టింది ఈ చిత్రం.ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్( Tillu Square ) అనే పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

Advertisement

ఆగస్టు నెలలో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, షూటింగ్ కి సంబంధించిన వర్క్ అప్పటికి పూర్తి అయ్యే ఛాన్స్ లేనందున ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఈ పోస్టర్ ని చూస్తుంటే ఇందులో అనుపమ పరమేశ్వరన్ సిద్దు తో రొమాన్స్ రెచ్చిపోయి మరీ చేసిందని అర్థం అవుతుంది.

చూడాలి మరి ఈ చిత్రం కూడా మొదటి భాగం లాగానే ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది.

తాజా వార్తలు