వైరల్ వీడియో: మరోసారి పర్ఫార్మన్స్ అదరగొట్టిన సుధీర్‌-రష్మి జోడీ..!

బుల్లితెరపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉండే మేటర్ ఏదైనా ఉంది అంటే అది సుధీర్ రష్మీ లపై ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉండనే ఉంటుంది.

ఇకపోతే తాజాగా బుల్లితెర పై మరోసారి సుధీర్ రష్మీ జంట తనదైన శైలిలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ని పండించారు.

తాజాగా జరిగిన ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈటీవీ ఛానల్ లో నిర్వహించిన జాతిరత్నాలు కార్యక్రమంలో రష్మీ సుధీర్ జంట ఉప్పెన చిత్రంలోని జల జల జల పాతం అనే పాటకు అదిరిపోయే ఫార్మెన్స్ ఇచ్చారు.అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వీరిద్దరికీ పెద్ద ఎత్తున పొగడ్తలతో కామెంట్స్ వస్తున్నాయి.

సుధీర్ రష్మి పర్ఫామెన్స్ అచ్చం సినిమాలో నటించిన హీరో హీరోయిన్లకు దీటుగా ఉండడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.ఇక యాంకర్ రష్మీ తన నటనతో తెలుగు కుర్రకారుకి మరింత వేడిని పెంచింది.

కేవలం రష్మీ మాత్రమే కాకుండా యాంకర్ సుదీర్ కూడా తనదైన మార్క్ స్టైల్ తో పర్ఫామెన్స్ ఇరగదీశాడు.జాతి రత్నాలు కార్యక్రమంలో వీరి ప్రదర్శన హైలెట్గా నిలిచింది.

Advertisement

వీరిద్దరు పర్ఫామెన్స్ చేస్తున్నంతసేపు సెట్స్ లో ఉన్నవారందరూ ముక్కు మీద వేలు వేసుకున్న చిన్నపిల్లలా వారి పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉండిపోయారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పెర్ఫార్మెన్స్ చేసిన వీడియో తెగ వైరల్ గా మారింది.ఈ పాట యూట్యూబ్ లో కచ్చితంగా సంచలనాలు క్రియేట్ చేస్తుందని ఇరువురి యాంకర్ల అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ జంట చేసిన పర్ఫామెన్స్ చూసేయండి.

Advertisement

తాజా వార్తలు