టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో, తన నవ్వుతో ఎంతో మంది కుర్రాళ్ళు మనసులను దోచుకుంది.
తన నటనతో అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలో కూడా నటించింది.
తొలిసారిగా మలయాళం ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా.
తాను నటించిన శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ఇక ఈ మధ్య వరుస సక్సెస్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది అనుపమ.గత ఏడాది విడుదలైన కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలు తనకు మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టాయి.
దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు.అంతేకాకుండా ఇటీవలే పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది అనుపమ.తనకు సంబంధించిన ఫోటోలను, ఫన్నీ వీడియోలు బాగా పంచుకుంటుంది.
నిజానికి ఆమె షేర్ చేసే ఫన్నీ వీడియోల వల్ల అల్లరి పిల్లగా పేరు సంపాదించుకుంది.ఇందులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తన సోదరుడితో కలిసి ఆట పట్టిస్తున్న వీడియోలను, అంతే కాకుండా తన సినిమా షూటింగ్ సమయంలో చేసిన వీడియోలను బాగా పంచుకుంది.
అప్పుడప్పుడు అందంగా రెడీ అవుతూ కుర్రాళ్ళ మనసులు దోచుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
ఖాళీ సమయం దొరుకుతే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.ఇక ఈ బ్యూటీ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటుంది.
అలా ప్రతి విషయంలో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈమెను తన అభిమానులు ముద్దుగా ఉప్మా అని పిలుస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకుంది.అయితే అందులో ఓ ఈవెంట్ లో యాంకర్ తన దగ్గరికి వచ్చి మీకు ఒక రాకెట్ వచ్చింది అంటూ ఇచ్చింది.
అయితే ఆ రాకెట్ పై ఉన్న లైన్ ను అనుపమ చదివింది.అందులో.పొద్దున్న తింటా ఉప్మా.నా గుండెల్లో ఉంది అనుపమ అంటూ ఓ అభిమాని రాసిన లైన్ కు ఫిదా అవుతూ మురిసిపోయింది అనుపమ.
ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.