వైరల్ వీడియో : ఆకలి మీదున్న సింహాలు, మొసళ్లు...చివరికి..?

ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి ఇట్టే తెలిసిపోతుంది.

ఈ క్రమంలో మనం సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

ఇందులో మనం ఎక్కువగా అడవికి రాజు అయిన సింహం కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సింహాల యుద్దానికి సంబందించిన వీడియోలు  తరచుగా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.అడవిలో జంతువులకు రారాజు అయిన సింహం ఉంటే.

నీటిలో నివసించే వాటికీ రారాజు మొసలి అనే చెప్పాలి.ఇక ఈ రెండు జంతువులు కూడా ఒక్కసారిగా ఎదురైతే వాటి మధ్య యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వీటి మధ్య యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో అసలు ఊహకు కూడా అందదు.అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

Advertisement

సాధారణంగా అడవిలో ఒక జంతువు చెరకు మరొక జంతువు దొరకకుండా ఉండేందుకు వాటిని రక్షించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక నది ఒడ్డున ఒక జంతువు  చనిపోయి ఉంది.

జంతువు కళేబరాన్ని ఒక సింహపు గుంపు తింటూ ఉండగా ఒక్కసారి అక్కడికి నీటికి రారాజు అయిన మొసళ్ళు గుంపు వచ్చింది .ఆ మొసళ్లను చూసే సింహం భయపడకుండా నువ్వా నేనా అంటూ యుద్ధానికి దిగాయి.ఈ క్రమంలో ఒక మొసలి  సింహాన్ని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా కానీ చివరకు ఫలితం దక్కలేదు.

ఈ వీడియోను లైఫ్ అండ్ నేచర్ వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతూ ఉండడంతో పాటు, నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.అలాగే నెటిజన్స్ ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ ఉన్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు