వైరల్: ఉబికి వస్తున్న నీటితో తడిసి ముద్దవుతున్న రైల్వే ప్రయాణికులు!

ఉబికి వస్తున్న నీటితో రైల్వే ప్రయాణికులు తడిసిపోవడం ఏమిటని ఆశ్చర్యంగా వుందా? మీరు విన్నది నిజమే ఆ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తమకు తెలియకుండానే స్నానం చేసేస్తున్నారు.

బేసిగ్గా ఇండియా రైల్వేలలో ప్రతిరోజూ కొన్ని లక్షలమంది ప్రయాణం చేస్తూ ఉంటారు.

ఇక్కడ కొంతమందికి ఆర్టీసీ బస్సులు ఎలాగైతే అందుబాటులో వుంటాయో కొన్ని ప్రాంతాల వారికి రైలు సదుపాయాలు అనేవి బాగా అందుబాటులో ఉంటాయి.దగ్గర దూర ప్రాంతాలకు వీరు ఎక్కువగా రైలులోనే ప్రయాణం చేస్తారు.

ఇకపోతే రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైలులో ఎలాంటి సదుపాయాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసినదే.అలాగే కొన్ని సార్లు కొన్ని చోట్ల అనుకోని సంఘటనల వలన రైల్వే ప్రయాణికులు ఒకింత ఇబ్బందులకు గురవుతూ వుంటారు.

తాజాగా జరిగిన ఓ సంఘటనతో రైల్వే ప్రయాణికులు అవాక్కయ్యారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో చక్కర్లు కొడుతుంది.

Advertisement

పశ్చిమబెంగాల్లో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.ఈ వీడియోలో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కుళాయి పాడవడంతో దానినుండి సరాసరి నీరు ఫిరంగిలాగా ముందుకు తన్నుకొని అవతలి ప్లాట్ ఫామ్ మీదనుండి వెళ్తున్న రైలులోని ప్రయాణికులను సైతం తడిపేస్తున్న దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు.

కాగా, ఈ వీడియోపై నెటిజన్లు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.అత్యధిక శాతంమంది దీనిని చూసి నవ్వుకుంటున్నారు.కులాయికి కోపం వచ్చినట్టుంది, అందుకే ఆ కోపం ప్రయాణికులపై చూపిస్తోంది అని ఒకరంటే, మన ఇండియన్ రైల్వే దుస్థితి చూడండి అని మరొకరు ఎండగట్టారు.

ఇంకొంతమంది రైల్లో ఫ్రీ షవర్ అంటే ఇదేనేమో! అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.మీరు కూడా ఇక్కడ వున్న వీడియోని చూసి మీకు నచ్చింది కామెంట్ చేయండి.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు