వైరల్ వీడియో: మనిషి వీడియో తీస్తుండగా ఎలుగుబంటి అటాక్..!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎప్పటికప్పుడు ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు ఆసక్తికరమైన అంశాలు, ఆసక్తికరమైన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

పైగా ఆ స్పెషల్ వాటికి స్పెషల్ కామెంట్స్ ను కూడా జత చేస్తూ ఉంటారు ఆనంద్ మహేంద్ర తాజాగా ఆనంద్ మహేంద్ర మోటార్ సైకిల్ ను వెంటాడుతున్న ఎలుగుబంటి వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వతలలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోకు జావా మోటార్ సైకిల్స్ టీం వారిని ట్యాగ్ చేయడం విశేషం.

ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో టీ గార్డెన్ లో ఇరువైపులా ఉన్న పొద్దున్నుంచి ప్రారంభమైతున్నట్లు వీడియోలో మనం గమనించవచ్చు.

అలా పచ్చని ప్రకృతిలో బైక్ పై వెళ్తున్న తరుణంలో ఎదురుగా ఒక మూడు ఎలుగుబంటిలు దర్శనమిస్తాయి ఇక వెంటనే వాటిని చూసిన ఆ వ్యక్తి దూరం నుండే చూస్తూ వీడియో రికార్డు చేస్తూ అలానే ఉండిపోయాడు.

Advertisement

ఇదిలా ఉండగా కొద్ది సెకన్ల తర్వాత ఒక ఎలుగుబంటి అతని వైపు పరిగెత్తుకొని రావడం మనం వీడియోలో గమనించవచ్చు.ఇక ఈ వీడియోను ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ నీలగిరి పర్వతాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఇది జరిగింది.థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి.

జావా మోటార్ సైకిల్స్ టీం ఎలుగుబంట్లు వార్నింగ్ ఇస్తే జాగ్రత్తగా ఉండాలనే దానిని ఇంట్రడ్యూస్ చేయాలి అనే కామెంట్ ను జత చేశారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement

తాజా వార్తలు