ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ ‘వారిసు’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కోలీవుడ్ లో భారీ అంచనాలను నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా జనవరి 11న తెలుగులో తప్ప మిగిలిన అన్ని చోట్ల గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ మిగతా బాషల కంటే తెలుగులో మూడు రోజులు ముందే రిలీజ్ అయ్యింది.
థియేటర్స్ సమస్య కారణంగా ఈ సినిమాను తెలుగులో వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు.ఇక తెలుగులో ఈ సినిమా జనవరి 14న అంటే ఈ రోజు రిలీజ్ అయ్యింది.ఇదిలా ఉండగా ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరినట్టు తెలుస్తుంది.తమిళ్ లో విజయ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
దీంతో ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది.అందుకే ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది.దీనితో ఈ కొత్త ఏడాదిలో తమిళ్ ఇండస్ట్రీలో 100 కోట్లు అందుకున్న మొదటి సినిమాగా వారిసు నిలిచింది.ప్రస్తుతం వీకెండ్ కావడంతో మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.
మరి తెలుగులో ఈ రోజు ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి.