టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా, మోస్ట్ గ్లామరస్ బ్యూటిగా అందరి హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ నయనతార.ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.నటనకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది.అలా ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నయనతారను మించిన వారుండరని చెప్పవచ్చు.ఈ బ్యూటీ తొలిసారిగా 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.
ఆ తర్వాత మూడేళ్లకు 2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది.
ఇక నయనతార హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.అది కూడా తన ప్రేమ విషయంలో అందరి దృష్టిలో పడింది.
ఇక తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కొంతకాలం ప్రేమాయణం నడిపగా ఇటీవల ఆయనను వివాహం చేసుకుంది.చాలా వరకు ఈ పెళ్లి కూడా అవుతుందా కాదా అని చాలా డౌట్ పడ్డారు.
కానీ మొత్తానికి పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ గడుపుతుంది.
అంతేకాకుండా సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లితండ్రులయ్యారు.
దీంతో ఈ విషయంలో కూడా నయనతార దంపతులు బాగా హాట్ టాపిక్ గా మారారు.ఇక ప్రస్తుతం ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు.
వారిద్దరూ తమ పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నారు.ఇక ఇద్దరు దంపతులు తమ బిజీ లైఫ్ లో గడుపుతున్నారు.
ఓ వైపు ఫ్యామిలీతో గడుపుతూనే మరోవైపు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.ఇక విగ్నేశ్ విషయానికొస్తే ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.
మంచి మంచి సినిమాలను తరికెక్కించి మంచి సక్సెస్ లను అందుకున్నాడు.చాలావరకు నయనతారతో పలు సినిమాలు చేశాడు.ఇక ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటాడు.అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటాడు.నయనతారకు సంబంధించిన ఫోటోలను పెళ్లికి ముందు నుంచే పంచుకుంటూ ఉన్నాడు.
ఇక నయనతార విషయానికొస్తే తను సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించదు.చాలా తక్కువ సందర్భాలలో తను పోస్టులు షేర్ చేస్తుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే.తల్లిదండ్రులయ్యాక మొదటిసారి తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసుకున్నాడు విగ్నేష్.క్రిస్మస్ సందర్భంగా తన భార్య నయనతార, ఇద్దరు పిల్లలతో కలిసి ఫోటోలు దిగాడు.ఆ ఫోటో షేర్ చేసుకోగా వెంటనే వైరల్ అయింది.అందులో నయనతార కూడా బాబుని పట్టుకొని చాలా అందంగా కనిపించింది.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఇక నయనతార ఇటీవల కనెక్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.