'మా' ఎలక్షన్స్ పై వెంకీ ఇలా రెస్పాండ్ అయ్యారేంటి..?

మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికలపై నిన్న మొన్నటి వరకు హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి.ఈసారి బరిలో ఐదుగురు సభ్యులు పోటీకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఎవరి వారు వారి ప్లాన్లతో ముందుకెళ్తున్నారు.ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ప్రకటిస్తే.

మంచి విష్ణు సోలోగా ఒక స్పెషల్ వీడియో చేసి షాక్ ఇచ్చాడు.ఈమధ్యనే బాలయ్య బాబు కూడా మా ఫండ్స్ ఏమయ్యాయి.

అమెరికా వెళ్లి మరి షోలు చేశారు కదా.తెలంగాణా సీఎంతో రాసుకు పూసుకు తిరిగారు అయినా ఎకరం భూమి దక్కలేదా అని అన్నారు.అయితే బాలయ్య పంచులకు నాగబాబు రివర్స్ పంచ్ కూడా వేశారు.

Advertisement

ఇదిలాఉంటే లేటెస్ట్ గా నారప్ప ప్రమోషన్స్ లో భాగంగా విక్టరీ వెంకటేష్ మా ఎలక్షన్స్ పై స్పందించారు.ఏదీ మన చేతుల్లో లేదు. అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని సింపుల్ గా తేల్చేశారు వెంకటేష్.

అంతేకాదు మా ఎలక్షన్స్ గొడవలపై స్పందిస్తూ అవి శాశ్వతంగా ఉండేవి కావని ఆయన అనారు.మొత్తానికి వెంకటేష్ ఆన్సర్ తో మరోసారి ఆయన ఎంత కూల్ పర్సన్ అన్నది తెలుస్తుంది.

ఇక నారప్ప ఓటిటి రిలీజ్ చేయడం పట్ల అభిమానులకు క్షమాపణలు చెప్పారు వెంకటేష్.వారిని దృష్టిలో ఉంచుకునే సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు.

అంతేకాదు నారప్ప సినిమా కోసం చాలా కష్టపడ్డానని కూడా చెప్పారు వెంకటేష్.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు