టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు.ఈయన ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు.
అటు మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తూనే ఇటు సోలో హీరోగా కూడా చేస్తూ దూసుకు పోతున్నాడు.ఇటీవలే ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాతో మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రెజెంట్ ఈయన ల్యాండ్ మార్క్ సినిమాగా 75వ సినిమా రాబోతుంది.
ఈ సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడా అని ఆయన ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఇప్పుడు చేయబోయే 75వ ప్రాజెక్ట్ ఒక లెక్క.
అందుకే వెంకీ కూడా దీనికి తగ్గట్టుగా ప్రత్యేకమైన సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు తెగ చర్చించు కుంటున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందా అని మేకర్స్ ఎదురు చూస్తున్నారు.ఇటీవల కాలంలో ఈయన లెవల్ పెంచే ఒక్క సినిమా కూడా రాలేదు.
దీంతో 75వ సినిమా అయినా గ్రాండ్ గా ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ ల్యాండ్ మార్క్ మూవీ కోసం కొంత మంది దర్శకులను అనుకోగా వారు సెట్ కాలేదు.
అయితే హిట్ తో ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ తన 75వ సినిమా చేస్తున్నాడు అని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.హిట్ యూనివర్స్ లో వెంకటేష్ ను కూడా తీసుకు రాబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ హిట్ 3 తో పాటు ఈయనతో వెంకటేష్ ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.అలాగే ఈ సినిమా నుండి మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో కెజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ నటించ బోతుంది అని టాక్.మరి ఈ వార్త ఎంత నిజమో తెలియదు కానీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
అలాగే ఈ సినిమాను నిహారిక ఎంటెర్టైనమెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.