వెరైటీ దొంగ : డబ్బు, నగలు కాదు.. ప్యాంటు, చీరలే టార్గెట్..!

ఇంట్లో దొంగతనం జరిగింది అంటే ఆ ఇంట్లో నగదు, బంగారం ఎంత పోయిందో అని లెక్కలేసుకోవడం ఖాయం.

కానీ ప్రస్తుతం కొందరు వెరైటీ దొంగలు ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఇంట్లో చొరబడి డబ్బు, బంగారం కాదు ప్యాంట్లు, శారీలను దొంగతనం చేస్తున్నారు.

తెలంగాణాలో కొడంగల్ లో ఇలాంటి సంఘటన జరిగింది.కొండంగల్ లో మోనాచారి హాస్పిటల్ నిమిత్తం భార్యాపిల్లలతో పదిరోజుల పాటు ఊరు వెళ్లగా.

తాళం వేసి ఉన్న ఇంటిని గమనించిన దొంగ ఓ రాత్రి ఇంట్లోకి చొరపడ్డాడు.బీరువాలో 6 తులాల బంగారం, 30 తులాల వెండి కొంత నగదు ఉన్నా సరే వీటిని ముట్టుకోకుండా కేవలం కొత్త బట్టలనే తెసుకెళ్లాడు.

దొంగ ఆ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుని వదిలేసి కేవలం కొత్త ప్యాంట్లు, షర్టులు, చీరలు, మిగతా వాటిని తీసుకెళ్లాడని తెలుస్తుంది.ఇంట్లో దుస్తులు పోయిన విషయం గుర్తించిన యజమానులు పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

ఇంటిని తనిఖీ చేయగా బంగారం, వెండి, డబ్బు భద్రంగా ఉండగా కేవలం దుస్తులు మాత్రమే దొంగతనానికి గురవడం విశేషం.కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

 ఇంతకీ అతను ప్రొఫెషనల్ దొంగా లేక కేవలం వీళ్ల ఇంట్లో మాత్రమే దొంగతనం చేశాడా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు