టాలీవుడ్ కోలీవుడ్ లలో హీరోయిన్ గానే కాకుండా లేడీ విలన్ పాత్రను కూడా అవలీలగా చేసేటువంటి నటీమణుల్లో సీనియర్ హీరో శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే ఈమె సినీ పరిశ్రమకి వచ్చినటువంటి అనతికాలంలోనే విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంది.
అంతేకాకుండా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఔరా…! అనిపిస్తోంది.అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నటి రాధిక పై వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా సీనియర్ నటి రాధిక తన తండ్రి అయినటువంటి శరత్ కుమార్ కి రెండవ భార్య కావచ్చు కానీ తనకు మాత్రం అమ్మ కాలేదని తెగేసి చెప్పింది.అంతేకాక తన తల్లి స్థానంలో వేరే ఎవరిని ఊహించుకోలేనని తన తల్లి స్థానం కేవలం తన కన్న అమ్మకి మాత్రమే ఉందని అంటోంది ఈ అమ్మడు.
అలాగని నటి రాధిక ను తానేమి తక్కువ చేసి మాట్లాడడం లేదని అలాంటి ఉద్దేశ్యం కూడా తనకు లేదని, తనకు ఇచ్చేటువంటి గౌరవ, ఎప్పటికీ ఇస్తూనే ఉంటానని అందులో ఏ లోటు ఉండదని అన్నారు.దీంతో ఈ విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి.
అంతేకాక కొందరు సీనియర్ నటి రాధిక పై వరలక్ష్మి శరత్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలపై పలు రకాలుగా గుసగుసలాడుకుంటున్నారు.ఈ మధ్యకాలంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట్లో తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని అంతేగాక నటి రాధికతో కూడా కొంతమేర విభేదాలు ఏర్పడ్డాయని అందువల్లే వరలక్ష్మి శరత్ కుమార్ రాధిక పై ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో నాంది అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తయింది.రెండవ షెడ్యూల్ కూడా తాజాగా మొదలుపెట్టినట్లు సమాచారం.