గన్ మెన్ లను వెనక్కి పంపేసిన వంగవీటి రాధా..!!

ఇటీవల వంగవీటి రంగ వర్ధంతి నాడు ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి రాధా కీలకమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

తనని చంపడానికి రెక్కీ నిర్వహించారని, రెక్కీ నిర్వహించిన వాళ్ళు ఎవరో.

కూడా తనకు తెలుసని.త్వరలోనే వాళ్ల పేర్లు బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో వంగవీటి రాధా కి స్నేహితులుగా ఎప్పటినుండో ఉన్న వైసీపీ మంత్రి కొడాలి నాని ఈ విషయాన్ని టేకప్ చేసి.ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.

భద్రత కల్పించే దిశగా అడుగులు వేయడం జరిగింది.దీంతో ప్రభుత్వం వంగవీటి రాధాకు టు ప్లస్ టు భద్రతను ఏర్పాటు చేస్తూ ఇద్దరు గన్ మెన్ లను కూడా కల్పించారు.

Advertisement

ఈ క్రమంలో నిన్న ప్రభుత్వం తరఫున వెళ్లిన ఇద్దరు గన్ మెన్ లను వంగవీటి రాధా వెనక్కి పంపించేశారు.నాకు ఎవరి సెక్యూరిటీ అవసరం లేదని చెప్పుకొచ్చారు.

నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని.అందువల్లే వద్దంటున్న అని అన్నారు.

ఇక ఇదే తరుణంలో అన్ని పార్టీల నుంచి నా క్షేమం కోరి ఫోన్లు వచ్చాయి.పార్టీలకతీతంగా అందరూ నాతో మాట్లాడారు.

అన్ని పార్టీల వాళ్లతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి అని స్పష్టం చేశారు.ఇక ఇదే క్రమంలో పోలీసులు ఇప్పటివరకు రాలేదు వస్తే స్పందిస్తానని వంగవీటి రాధా చెప్పుకొచ్చారు.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
పోస్టర్ పాలిటిక్స్ : కేసీఆర్ కనబడుటలేదు

మొత్తంమీద రక్షణకోసం ప్రభుత్వం పంపిన గన్ మెన్ లను.వంగవీటి రాధా వెనక్కి పంపడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు