ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు స్టార్ సెలబ్రెటీలు నటించిన సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలను ఇష్టపడటం లేదు.కంటెంట్ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా సినిమాలకు మంచి విజయం అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు ఉన్నాయి.ఇకపోతే ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం దారి.
ఈ సినిమాకి యు సురేష్ బాబు దర్శకుడిగా వ్యవహరించగా ఈ చిత్రాన్ని ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు.చిత్రంలో సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, అభిరామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
ఇక ఇదివరకే దారి సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయగా ఈ పోస్టర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక ఈ ట్రైలర్ లో ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంటుంది.అలాగే ఈ కథలో కూడా సమస్యలకు కొలతలు లేవు కానీ రూపం ఉంది సమస్యను పట్టుకోవాలని, తీర్చాలని, ఆ సమస్యను వెతుక్కుంటూ.ఆ సమస్యను తికమక్క పెట్టెలా కదులుతుంటారు.అయితే అందరి సమస్య ఒకటే ఈ సమస్య నుంచి దాక్కోవడం, పారిపోవడం.ఒకటి మాత్రం గుర్తు పెట్టుకుందాం మన సమస్యను పరిష్కరించడానికి ఎవరు రారు. ఆఖరికి దేవుడు కూడా రారు అని చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వైరల్ అవుతుంది.