పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తున్నటువంటి చిత్రం బ్రో(Bro).తమిళంలో సముద్రఖని (Samuthirakani) నటించిన వినోదయం చిత్తం (Vinodhaya Sitham) సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమాకు నటుడు సముద్రఖని దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకోబోతుంది.తమిళ సినిమాలు ఎలాంటి ఐటమ్ సాంగ్స్(Item Songs) లేకపోయినప్పటికీ తెలుగు వెర్షన్ లో మాత్రం ఐటమ్ సాంగ్ ఉండే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram srinivas) ప్లాన్ చేశారు.ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించడమే కాకుండా స్క్రిప్ట్ పనులను కూడా త్రివిక్రమ్ చూసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈయన ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండాలని ప్లాన్ చేశారట.అయితే ఈ స్పెషల్ సాంగులు డాన్స్ చేయడానికి ముందుగా నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh)ను ఎంపిక చేశారు.ఇక నేటి నుంచి ఈ పాట షూటింగ్లో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొనాల్సి ఉంది.అయితే ఈమె శుక్రవారం తాను ఈ పాట షూటింగ్లో పాల్గొనలేకపోతున్నానని తనకు డేట్స్ ఏ మాత్రం అడ్జస్ట్ కావడం లేదంటూ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇలా చివరి క్షణాలలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ పాట నుంచి తప్పకుండా అని ప్రకటించడంతో చేసేదేమీ లేక మేకర్స్ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)ను సంప్రదించారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మేకర్స్ ఈమెతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈమెను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేయడానికి రకుల్ హ్యాండ్ ఇవ్వడంతో ఊర్వశి ఎంట్రీ ఇచ్చారని సమాచారం.ఈ మధ్యకాలంలో ఊర్వశి పెద్ద ఎత్తున స్పెషల్ సాంగ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇదివరకే ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాసు వేర్ ఇస్ ద పార్టీ అనే పాట ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అలాగే అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ చేశారు.
ప్రస్తుతం బ్రో సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని తెలియడంతో ఈ సినిమాపై మరి కాస్త అంచనాలు పెరిగాయని చెప్పాలి.