శ్రీవారి అనుగ్రహంతో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని,స్వామివారిని ప్రార్థించినట్లు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్( piyush goyal ) తెలిపారు.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని( Tirumala ) దర్శించుకున్నారు… ఆలయం వద్ద ఆయనకు టిటిడి అధికారులు స్వాగతం పలికే దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా,అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు…
ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి మరింత సేవ చేసే భాగ్యం తనకు కల్పించాలని, దేశ ప్రజలకు స్వామి ఆశీస్సులు ఉండాలని తెలిపారు…