కొఠియా గ్రామాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో ఏపీ, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది.
కొఠియా గ్రామాలు ఒడిశావే అంటూ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం గా మారాయి.కొఠియా గ్రామాల్లో పర్యటనకు వచ్చిన మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసేందుకు ఏపీ పోలీస్ అధికారులు వెళ్లారు.
అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడి ప్రజలు ఏపీ అధికారులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.