టీడీపీలోకి మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు

ఏపీలో విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న షాక్ ఇచ్చేందుకు రెడీ అవ్వ‌గా, ఇప్పుడు అదే లిస్టులో మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు చేరిపోనున్నారు.

క‌ల్ప‌న జ‌గ‌న్‌కు షాక్ ఇస్తుంటే, ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క‌లిసి జ‌గ‌న్‌కు డ‌బుల్ షాక్ ఇవ్వ‌నున్నారు.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కృష్ణా జిల్లాకే చెందిన వారు కావ‌డం విశేషం.కృష్ణా జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ మొత్తం 5 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది.

వీరిలో విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ ఇప్ప‌టికే టీడీపీలో చేరిపోయారు.ఇక పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న కూడా టీడీపీలో చేరిపోతున్నారు.

ఇదిలా ఉంటే ఇదే జిల్లాకు చెందిన మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు మేకా ప్ర‌తాప్ అప్పారావు (నూజివీడు), ర‌క్ష‌ణ నిధి (తిరువూరు) కూడా సైకిలెక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.ఈ ఇద్ద‌రిలో నూజివీడు ఎమ్మెల్యే ప్ర‌తాప్ అప్పారావు ఎప్ప‌టి నుంచో టీడీపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

ఇప్పుడు వైసీపీలో రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయిన ప్ర‌తాప్ సైకిలెక్కాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.ప్ర‌తాప్ గ‌తంలో టీడీపీలో ప‌నిచేశారు.

చంద్ర‌బాబుతో ఆయ‌న‌కు ప‌రిచ‌యాలు ఉన్నాయి.ఈ క్ర‌మంలో ప్ర‌తాప్‌తో పాటు ప‌క్క‌నే ఉన్న తిరువూరు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి సైతం టీడీపీలో చేరే అంశంపై టీడీపీ జిల్లా నాయ‌క‌త్వంతో చ‌ర్చ‌ల్లో ఉన్నార‌ట‌.

క‌ల్ప‌న‌కు తోడుగా వీరిద్ద‌రు కూడా పార్టీ మారిపోతే ఇక కృష్ణా జిల్లాలో వైసీపీకి గుడివాడ ఎమ్మెల్యే నాని మాత్ర‌మే ఉంటారు.ఏదేమైనా న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే కృష్ణా జిల్లాలో అది వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు పెద్ద చావుదెబ్బ లాంటిదే.

జ‌గ‌న్‌కు వీళ్ల స్థానాల‌ను భ‌ర్తీ చేయాల్సి రావ‌డం క‌త్తిమీద సాముగానే ఉంటుంది.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు