శాకుంతలంలో మరో ఇద్దరు హీరోయిన్లు.. ఎవరంటే?

తెలుగు సినీ పరిశ్రమలో గుణశేఖర్ దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే ఆయన తీసుకునే కథలు అంతగా ఆకట్టుకుంటాయి.

ఆయన ఎక్కువ చారిత్రక, పౌరాణిక సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు.అంతేకాకుండా వాటిని చిత్రించడంలో కూడా దాని స్థాయిలో ఆసక్తి చూపిస్తాడు.

నటి అనుష్కతో తెరకెక్కించిన రుద్రమదేవి సినిమా గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం శాకుంతలం సినిమాను చేస్తుండగా అందులో లో మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయనున్నారట.

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా బాల రామాయణం.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.

Advertisement

ఇదిలా ఉంటే రుద్రమదేవి సినిమా తరువాత పౌరాణిక చిత్రాలలో హిరణ్యకశిప సినిమాను హీరో రానా తో కలిసి చేయాలనుకోగా ఈ సినిమాకు కాస్త సమయం పడింది.కాగా ఈ సినిమా కంటే ముందు ప్రస్తుతం శాకుంతలం సినిమాను పరిచయం చేయాలనుకున్నాడు.

ఈ సినిమా మహాభారతంలోని ఆది పర్వం నుంచి తీసుకున్నారు.ఇందులో శకుంతల గా మోస్ట్ గ్లామరస్ బ్యూటీ సమంతను తీసుకోగా దుష్యంతుని పాత్ర కు నటించే హీరో ఎవరా అని తెలియరాలేదు.

ఈ సినిమా లో సంగీతం మణిశర్మ అందింస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో రెండు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయని గుణశేఖర్ తెలపగా రెండు పాత్రలు మరో ఇద్దరు హీరోయిన్లతో కలిసి తీయాలనుకుంటున్నారు.ఈ రెండు పాత్రలు అనసూయ, ప్రియంవద.మీరిద్దరూ శకుంతలకు ప్రాణసఖులు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

శకుంతల పాట పాటల్లోనూ, ఆమె ప్రేమ విరహం లోను, తను భర్తకు దూరమైన సమయంలో వాళ్లు తనతోనే ఉంటారు.కాబట్టి ఈ పాత్రలు ఎంతో ముఖ్యమైనవి కాబట్టి.

Advertisement

దర్శకుడు ఈ పాత్రలకు తగ్గట్టుగా ఉండే మరో ఇద్దరు హీరోయిన్లను నిర్ణయించుకున్నాడు.కాగా ఇద్దరు హీరోయిన్ లు ఎవరా అని ఇప్పటివరకు గుణశేఖర్ తెలపకపోగా త్వరలోనే తెలుపుతామని వెల్లడించారు.

తాజా వార్తలు